సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'పడిపడి లేచె మనసు' షూటింగ్ పూర్తి 
  • కేరళలో 'అరవింద సమేత'కు థియేటర్ల పెంపు
  • మరో చిత్రానికి ఓకే చెప్పిన గోపీచంద్!     
*  శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న 'పడిపడి లేచె మనసు' చిత్రం షూటింగ్ పూర్తయింది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెడుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుండగా, సాయిపల్లవి డాక్టర్ గా నటిస్తోంది.
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన 'అరవింద సమేత' చిత్రం మలయాళ వెర్షన్ ను కూడా తెలుగు వెర్షన్ తో పాటుగా కేరళలో రిలీజ్ చేశారు. 'వీరరాఘవ రెడ్డి' పేరిట రిలీజైన మలయాళ వెర్షన్ కి కూడా అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు థియేటర్లను పెంచుతున్నారట.
*  ఇటీవల 'పంతం' సినిమాలో నటించిన హీరో గోపీచంద్ మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. 'విన్నర్', 'బలుపు' చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందే చిత్రంలో గోపీచంద్ నటిస్తాడని సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ సినీ మీడియా నిర్మిస్తుంది.
Go Back to Shorts
Saipallavi
sharwanand
ntr
gopichand

More Telugu News